సాహిత్యంలో ప్రగతి ఉండదు, విజ్ఞానశాస్త్రంలో వలె. కవికి సమాజం పట్ల ప్రత్యక్ష బాధ్యత ఉండదు, అంటాడు ఎలియట్. అతని బాధ్యత భాషకే. తన సాటివారి భాషను స్వీకరించి, దానిని శుద్ధిచేసి, కావ్యయోగ్యంగా తీర్చి దిద్దడమే ప్రజల పట్ల కవి పరోక్షబాధ్యత.

నేను ప్రతిరోజూ
రెండు పూటలా
ఒక ఆడపిల్లల కాలేజ్‍లో
ఫిజిక్స్ పాఠాలు చెబుతాను
తీరిక వేళల్లో – అంటే
కాలేజ్‍కి శలవులప్పుడూ
వాళ్ళు బుద్ధిగా
పరీక్షలు రాస్తున్నప్పుడూ
నేను కవిత్వం రాస్తాను.

మనుషులు మాటలకి, చిన్నపాటి ఈగో తృప్తికే వారిని వారు గొప్పవాళ్లుగా బలవంతులుగా ఎలా అనుకుంటారో, వీళ్ళింత బలహీనులేంటి అనిపిస్తది నాకు. ఇవన్నీ అనుకొని చేసిందా లేకా అనుకోకుండా చేసిందా అన్నదాన్లో నాకెలాంటి అనుమానం లేదు. ఇన్నీ జరిగాకా సంతోష్ నస్రీన్ కోసం పనిచేయడానికి రత్నాన్ని పక్కన పెట్టడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టలేదు.

అతను ఆ సంఘటనని కవితాత్మకంగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ‘అతను పేలిపోయాడు’ అనే పదప్రయోగం ఇంతకుముందు ఎక్కడా వినలేదు నేను. బహుశా ఇది యుద్ధ పరిభాష అయి ఉండాలి. సందేహం లేదు, ఇది యుద్ధ భాషే. అతను చెప్తూ ఉంటే, ఆ సంఘటన నా కళ్ళ ముందే జరిగినట్టు, నేను అప్పుడు అక్కడే ఉన్నట్టుగా, అదంతా స్లో మోషన్‌లో జరిగినట్టు నా కళ్లముందే కనిపిస్తోంది.

‘నడిచిన పుస్తకం మా నాన్నగారు’ అన్నాను ఒకసారి. ‘చదవడం కాక ఇంకేవైనా చేసేవారా అన్పిస్తుంది’ అన్నాను ఒకసారి. జీవితం అత్యంత విలువైనదా? సాహిత్యం జీవితంకన్నా విలువైనదా? దానిమీద నా వుద్దేశాలు చాలాసార్లు మారేయి. మారుతూనే వున్నాయి. కానీ మా నాన్నగారు సాహిత్యాన్ని జీవితంకన్నా విలువైనదిగా భావించినట్లు తోస్తుంది.

కేతన చెప్పిన సంధి సూత్రాలు ఆనాటి భాషను కూడా పూర్తిగా వివరించేవి కావు, కానీ ఆయన చెప్పిన మేరకు అవి ఆ కాలపు కావ్య భాషలోని అనేక తెలుగు సంధులను ఉదాహరణలతో సూత్రీకరించిన తీరు లోని సరళత ఆధునిక వ్యాకర్తలకు, భాషా శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం కావాలి.

బుస్సీగారు తన కార్యసాధన విధానమున కేవలం సైనికబలముపైననే ఆధారపడి యూరకుండలేదు. అది అతని పలుకుబడికిని అధికారమునకును పునాదియైనమాట నిజమే. అంత బలవత్తరమైన స్థానమును పొందిన మరియొక సామాన్యవ్యక్తియైనచో దానిని వృథాచేసి యుండెడివాడు. బుస్సీగారికి విదేశీయుల స్వభావము, చిత్తవృత్తి బాగా తెలియును.

అలా ఎలా ప్రేమించేశావు
నువు పుట్టడాన్నీ
నీ ముందు ప్రపంచం పుట్టడాన్నీ
అవి నిద్రలోకి రాలిపోవడాన్నీ
అనుభవాలు గతంలోకి
ఉత్సాహం భవితలోకీ జారిపోవడాన్నీ

ఆనందుడు నవ్వుతూ చెప్పాడు, “పిచ్చివాడా, ‘బుద్ధేర్లోకానతస్త్రాతుమితి స్థితోస్మి’ ఆయనే చెప్పారన్నావుగా? మనకి ఈ ప్రపంచంలో తగులుకున్న భవరోగానికి దారి చూపించే భగవానుడికి గృహస్థు ఇంటికి దగ్గిర దారి ఎటువైపు ఉందో తెలియకపోవడమేమిటి? నీ కోసమే అటువైపు కావాలని, నేను మరొకర్ని తోడు పంపిస్తానన్నా వద్దని, ఒక్కడూ వచ్చాడు. నీ అదృష్టం ఏమని చెప్పేది?”

తెలుగులో అంత్యప్రాస రగడలకు తప్పనిసరి. మిగిలిన ఛందములకు ఐచ్ఛికము. కొందఱు ద్విపదకు కూడ పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు పాదాంత విరామయతి నియతము అన్న మాటను మఱువరాదు ఈ సందర్భములో.

చిరువలయాల్లోంచి చదరాల్లోకీ సూటిగీతల్లోంచి
పేరుకునే నురగలకింది శూన్యపు ఉరవడుల్లోకీ
మలుపుల తలపుల్లోకీ రూపాల్లోంచి పాపాల్లోకీ
జారబోయినప్పుడల్లా పట్టుకోబోయి జార్చుకున్న బొమ్మే.

వెలుగు కన్నెత్తికూడా చూడని చీకటిగదిలో
ఒంటరితనపు పక్కమీద
నిద్రపట్టక దొర్లుతున్నప్పుడు
మనం ఆశాదీపాలనుకున్నవాళ్ళు
కిటికి సందుల్లో నుండి మిణుగురుల్లా
మెరిసి మాయమైపోతారు

ముగ్గులు లేవిట, కానీ
అగ్గలమగు సంతసమున నతివలు నీకై
యొగ్గిరి కుసుమాంజలులన్
దిగ్గున రమ్మిక నవాబ్ద! దీవింప మమున్.
 
వడకఁగానేమి వలిచేత వపువు లిచట,
లోనఁ గలదోయి వెచ్చనిదైన మనసు
అందుచేఁ బల్కెదము మనసార నీకు
నంచితంబగు నాహ్వాన మభినవాబ్ద!

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం!